Friday, February 16, 2007

బ్రాహ్మీ ముహుర్తం

తెల్లారుజామున యోగా ,ధ్యానం చేస్తే బెమ్మాండమయిన ఆలోచనలొస్తాయని ప్రియతమ ముఖ్యమంత్రి సెలవిచ్చారు . దానర్ధం మిగతా వారందర్నీ ఆ పని చేయమనేమో ..ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టాంటి అమూల్యమయిన అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు ..ఆయనో అడుగు ముందుకేసి తమ్ముళ్లందరికి యోగా తరగతులు కూడా నిర్వహించిన గుర్తు ..ఏమో ఈ నాయకులు మాటలు చేతలు నిముషానికి ఒకటి ఉంటే ఎవడేమన్నాడో ఎవడికి గుర్తు ...పాపం ఆ బాధ నుండి తప్పించడానికేనేమో నువ్వు అది చేసావ్ , ఇది చేయలేదు అని ప్రస్తుతాలు మాజీలకి అనుక్షణం గుర్తు చేయడం..అంతేతప్పితే తామేంచేస్తామో ఎవడూ చెప్పేలా లేడు ..అన్నట్టు సదరు బ్రాహ్మీ ముహుర్తంలో వచ్చిన ఒకానొక బెమ్మాండమయిన ఆలోచన "ఇందిరమ్మ చెరువులు" అని ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు ..అప్పుడెప్పుడో బాబు గారు "నీరు - మీరు" అనో ఇంకేదో పేరుతోనో ఇట్టాంటిదే ఏదో పధకం దిగ్విజయంగా ( ఆయన దౄష్టి లో ) నిర్వహించినట్టున్నారే ..కాస్త కాస్త గుర్తొస్తుంది ..నే చెప్పలా వీళ్లు వాళ్లని గుర్తు చేస్తారని ..ఇంకో అధ్బుతమయిన ఆలోచన ..బొగ్గు ని విద్యుత్తు ఉత్పత్తి కి వాడాలని ...తద్వారా నీటి ని ఆదా చేయొచ్చని ..పనిలో పనిగా నల్లగా ఉండటం వలన బాబుకి బొగ్గు నచ్చలేదని చురక ..బొగ్గు అనేది ఒకసారి వాడితే మరలా మరలా భూమిలో తయారు కాదు ....కొన్నాళ్లకి బొగ్గు అడుక్కోవలసి రావడం ఖాయం ..కానీ నీరు అలా కాదేమో కదా ..ఆ మాత్రం ఆలోచన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి , బ్రహ్మీ ముహూర్తంలో , వచ్చి ఉండదా? ఏమో ఆయన అదికూడా ఆలోచించి ఉంటారేమో ..బుద్ది లేని , కాదు కాదు , విచక్షణ లేని వాళ్లం మనకేం తెలుసు ..

No comments: