Sunday, March 31, 2019

పదేళ్లలో సాధించిన ప్రగతి

జలయజ్ఞం ద్వారా హరితాంధ్రప్రదేశ్ గా అవతరించాల్సిన రాష్ట్రం బంగారు తెలంగాణా మరియు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా విడదీయబడింది.
సదరు రాష్ట్రాల వద్దనున్న "బంగారానికి" కాపలాదారుగా మరొకరికి అవకాశం ఇవ్వడం ప్రియతమ ప్రధానికి నచ్చక ఆయనే స్వయం గా ఆ పనిలో క్షణం ఖాళి లేకుండా పని చేస్తున్నారు. ప్రజలందరి దగ్గర సంపద ఉంటే కాపలా కి కష్టం కాబట్టి , నోట్ల రద్దు ద్వారా  సదరు సొమ్ములు వెనక్కి తీసుకొని , ఎవరికి ఎంత అవసరమో అంతే సొమ్ము జనధన్  ఖాతాలలో జమ చేస్తున్నారు. ఆయన కష్టాన్ని అర్ధం చేసుకోకుండా అన్నా చెల్లెళ్లు ఆయన్ని డబ్బున్న వారి కాపలాదారు అనడం ఎంత వరకు సమంజసం?  దేశం లోపల  కంటే వెలుపలే ఎక్కువ ఉంటున్నాడు అని  ఆరోపణ .  నిజం సెప్పండి , మన ఇంటి కాపలాదారు  మన ఇంట్లో కంటే పక్కింటి కాపలాదారుతో ఎక్కువ సమయం గడిపడూ ?ఇది కూడా అంతే !!! అంతేగా అంతేగా !!1