Wednesday, July 12, 2006

ముంబయి

బొంబాయి ఉలిక్కి పడింది ....కొన్ని గంటల్లో సర్దుకొంది ...కొన్ని చోట్ల అసలేమీ జరగనట్టు జనం తమ తమ పనుల్లో మునిగి పోయారు ...పక్క రాష్ట్రాల్లో అసలా విషయమే పట్టనట్టు అంతకంటే ముఖ్యమైన పనులు చక్కబెట్టటం లో హడావిడి గా ఉన్నారు ...ఉదాహరణ కి మండల ఎన్నికలు ...
ముంబయి లో బాంబు పేలితే న్యూయార్కు లో రైళ్లు ఓ సారి ఆగాయి ...ముందు జాగ్రత్త చర్యలు ...పెరిగిన గస్తీలు ...షికాగో లో రైలు పట్టాలు తప్పితే జనం పరుగులు ...అక్కడనుండి దూరంగా పారిపోవడానికి ...అదీ టెర్రరిస్టుల పనేనేమో అని భయంతో ...
భారతావని లో ఇదేమీ మొదటి సారి కాదు ఇలాంటి దురాగతం జరగటం ...కానీ ఎన్నడూ లేనిది ..ఈసారి ఎంచేత ఒకరి తరువాత ఒకరు ఖండించడాలు? బ్లెయిర్ , రైస్, ఖార్జాయ్, ముషరఫ్ ...ఒకప్పుడు కాశ్మీర్ లో ఉన్నది ఉగ్రవాదులు అంటే వినీ విననట్టున్న ఇవే దేశాలు ఇవాళ ఉన్నట్టుండి కళ్లు తెరిచాయేంటో?
ఇక మన నాయకులు ...షరా మాములే ...ఖండించడాలు , నిందించడాలు ...శివరాజ్ పాటిల్ గారు మాడం సోనియాకు పరిస్థితి నివేదించారట ...భేష్...వచ్చే ఎన్నికలలో టికెట్టు ఖాయం ...CNN వాడు మొట్ట మొదటగా దౄశ్యాలను ప్రసారం చేసాడట ...కాలరు ఎగరేయలేక కష్టాలు పడుతున్నాడు ..
ఇద్దరే ఇద్దరు ...ఎగేసుకొంటూ వచ్చే నాయకులని రావొద్దు అని సున్నితంగా చెప్పిన శరద్ పవార్...రెండో వారు ...వెంటనే స్పందించిన సామాన్య ప్రజలు ..బాంబు పేలగానే ఎక్కడివక్కడ వదిలేసి పరుగులు తీయకుండా (విదేశంలో లా) , ప్రభుత్వం పంపే సహాయం కోసం ఎదురు చూడకుండా ,రంగంలోకి దిగి సహాయం చేసిన ప్రజ,వర్షంలో తడుస్తూ కూడా ఆసుపత్రినుంచి ఆసుపత్రికి రక్తాన్ని ఇవ్వడానికి తిరిగిన సామాన్య ప్రజ ...mumbaihelp.blogspot.com లో తమకి చేతయిన సాయం చేస్తున్న సామాన్య జనం ॥।

No comments: